ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హైడ్రోజన్కు అత్యంత ప్రాముఖ్యత, డిమాండ్ ఉంది. శక్తి సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే వాహకంగా దీనిని భావిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, ద.ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు
. గ్రీన్ హైడ్రోజన్ విషయంలో వారి దేశాల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను వివరించారు. ఆగ్నెస్ ఎం.డా కోస్టా (గనుల మంత్రిత్వ శాఖ, బ్రెజిల్), కోవెలెవ్ ఆండ్రీ (రష్యన్ ఎనర్జీ ఏజెన్సీ, రష్యా), డా.ప్రకాష్ చంద్ర మైథాని, (శాస్త్రవేత్త, ఎంఎన్ఆర్ఈ), ఫు తియాన్యి (నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా), మక్గాబో హెచ్ సిరి (అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ శక్తి విభాగంద.ఆఫ్రికా) ముఖ్య వక్తలుగా ఈ వెబినార్లో ప్రసంగించారు.