రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలి

బచ్చన్నపేట, జనవరి 24 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని అం బేద్కర్ ఫొటో సాధన సమి తి ప్రధాన కార్యదర్శి కడా రి జితేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పోచన్నపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఆయ న నివాళులర్పించారు. జితేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు మంజుల, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి అరుణ, నాయకులు సత్తయ్య, కొమురయ్య, ఐలయ్య, ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కళ్లెం సొసైటీ అధ్యక్షుడు బుషిగంపల ఉపేందర్గౌడ్ అన్నారు. మండలంలోని కళ్లెంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఆర్బీఐ ఆవిర్భావానికి ముందే అంబేద్కర్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మబ్బు రమేశ్, బాల్నె శేఖర్, మబ్బు నగేశ్, పరశురాములు, నరేశ్, నర్సయ్య, శ్రీను, ఐలమల్లయ్య, భిక్షపతి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!