ఖిలాషాపురం కోటకు రూ.1.26 కోట్లు

- మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసిన సర్కారు
- వర్షాలకు కూలిన బురుజు
- పునర్నిర్మాణానికి పరిపాలన అనుమతులు
జనగామ, నమస్తేతెలంగాణ, జనవరి 21 : జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న కోట బురుజు పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.26 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పనులకు సంబంధించి గురువారం సాయంత్రం పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి శాఖ కార్యదర్శి కేఎస్.శ్రీనివాసరాజు జీవో జారీ చేశారు. కొద్దినెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఖిలాషాపురం కోట సౌత్వెస్ట్ భాగంలోని బురుజు సగభాగం కూలిపోయింది. ఈ నేపథ్యంలో కోట బురుజు మరమ్మతు అంశాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన నిధుల మంజూరుకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని చాటేలా ఉన్న చారిత్రక ప్రాంతాలు, కట్టడాల నిర్మాణాలను కాపాడేందుకు ప్రభుత్వ కృషిని ఖిలాషాపురం గ్రామస్తులు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు