కొలంబో, జూన్ 17: శ్రీలంక సముద్ర జలాల్లో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన భారీనౌక నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ నౌకలో భారీ ఎత్తున రసాయనాలతో కూడిన కంటైనర్లు ఉండటంతో.. ఈ ఘటన పర్యావరణంపై పెనుప్రభావం చూపవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనటంతో అధికారులు నౌక శిథిలాలను బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారు.