కరోనా సోకిన పిల్లల్లో దేశంలోనే తొలిసారి
బేగంపేట్ జూన్ 17: కరోనా సోకి ఇబ్బంది పడుతున్న 9 నెలల శిశువుకు కిమ్స్ వైద్యబృందం ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రే న్ ఆక్సిజినేషన్ (ఎక్మో) చికిత్స అందించి ప్రా ణాలు కాపాడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 9నెలల శ్రేయా స్ జ్వరం, దగ్గుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటే నెలకిందట కొండాపూర్లోని కిమ్స్కు తీసుకొచ్చారు. బాలుడిని ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స ప్రారంభించారు. ఊపిరి తిత్తుల నుంచి గాలి లీకవుతూ కొత్త సమస్య ఉత్పన్నమై హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ చికిత్స కూడా పనిచేయలేదు. దీంతో డాక్టర్ల బృందం ఎక్మో సపోర్ట్తో చికిత్స ప్రారంభించి, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని కిమ్స్కు తరలించింది. 12 రోజులపాటు ఎక్మోసపోర్ట్తో చికిత్స అందించా రు. బాలుడు కోలుకోవడంతో ఎక్మో చికిత్స ఆపి వెంటిలేటర్పై కొనసాగించారు. నెల రోజులపాటు చికిత్సపొందిన బాలుడిని డిశ్చార్జి చేసినట్టు కిమ్స్ డాక్టర్ వీ నందకిశోర్ తెలిపారు.