హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని రోషన్ కాలనీ వడ్డేపల్లిలోని ఓ పరుపుల గోదామ్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.