కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్, పేదలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ ముందుకు వచ్చారు.. ఇందులో భాగంగా ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 రోజులుగా బియ్యంతో పాటు ఎన్-95 మాస్కులను పంపిణీ చేస్తున్నారు. తన కూతురు బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి, ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పూజా వ్యాస్ బిలాల్తో కలిసి ఆయన ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. గత సంవత్సరం లాక్డౌన్లోనే ట్రస్ట్ ద్వారా దాదాపు 60 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయగా.. ఈ సంవత్సరం లాక్డౌన్లో పేదలకు బియ్యం, పోలీసులకు ఎన్-95 మాస్కులు పంపిణీ చేశారు.
మినీ ఇండియాగా పేరుగాంచిన గోషామహల్ నియోజకవర్గంలోని కార్మికులు, పేదలకు బియ్యం పంపిణీతోపాటు.. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం బ్యాగుతో పాటు ఐదు ఎన్-95 మాస్కులు అంద జేశారు. అలాగే ఉద్యమ నాయకులను కూడా గుర్తించి వారికి బియ్యం బ్యాగులు, మాస్కులను పంపిణీ చేశారు. ఇలా నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నందకిషోర్ వ్యాస్ .
లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని భావించిన టీఆర్ఎస్ రాష్ట్ర నేత నందకిషోర్ వ్యాస్.. ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 రోజులుగా 8 వేల మంది పేద కుటుంబాలకు బియ్యంతో పాటు మాస్కులను పంపిణీ చేశారు. అదే వి ధంగా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు 3000 బి య్యం బ్యాగులు, 30 వేల ఎన్-95 మాస్కు లు అందజేశారు. పేదలను ఆదుకోవాలనే ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
గోషామహాల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య ఉన్నా.. మా దృష్టికి తీసుకువస్తే ట్రస్ట్ ద్వారా వారికి సేవలు అందిస్తాం.. లాక్డౌన్తో పేదలు ఉపాధి దొరకక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనే సంకల్పంతో ప్రతి కుటుంబానికి బియ్యాన్ని బస్తీలవారీగా పంపిణీ చేస్తూ.. ఎన్-95 మాస్కులను అందజేస్తున్నాం. 20 రోజులుగా 8వేల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశాం. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఆదుకోవడానికి 3000 బియ్యం బ్యాగులను అందజేశాం. పోలీసు అధికారులు, సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. గత లాక్డౌన్లో దాదాపు 60 వేల కుటుంబాలకు ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేశాం. -నందకిషోర్ వ్యాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అండగా ఉంటాం. ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి పేదలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. గర్భిణులకు ఆర్థిక సహాయం, పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, బియ్యం పంపిణీ, మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ల పంపిణీ వంటి.. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కూలిన వారికి ఆర్థిక సహాయం, బేగంబజార్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు బియ్యం పంపిణీని ఇరవై రోజులుగా బస్తీల్లో చేపట్టాం. – పూజావ్యాస్ బిలాల్, ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ