మాక్లూర్, జూన్ 8: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో సక్రియాతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలు, క్రైమ్ కేసులపై రోజువారీగా తనకు సమాచా రం ఇవ్వాలని ఎస్సై రాజారెడ్డికి సూచించారు. ధరణి సేవలు, ఉపాధి పనులపై తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. కరోనా ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. మండలంలోని మాక్లూర్, అ మ్రాద్ సొసైటీల్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారని విండో అధ్యక్షురాలు లక్ష్మి, శ్రీనివాస్గౌడ్ను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు, జీవనన్న యువసేన మండల అధ్యక్షుడు రంజిత్, సర్పంచులు పద్మ, శంకర్గౌడ్, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు సుక్కి సుధాకర్, శేఖర్రావు, దేవన్న, సురేశ్, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టెండర్లు చేయించాలని వినతి..
ఆర్మూర్, జూన్ 8: పట్టణంలోని క్షత్రియ సమాజ్ కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించారు. వాటికి టెండర్ చేయించాలని ఎమ్మెల్యేకు ఆర్మూర్ క్షత్రియ ప్రతినిధులు మంగళవారం కలిసి విన్నవించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజ్తో పాటు క్షత్రియ సమాజ్ ప్రతినిధులు పండిత్ ప్రేమ్, ఖాందేశ్ శ్రీనివాస్, పండిత్ పవన్, పడాల్ గణేశ్, సాత్పుతే శ్రీనివాస్, బొబిడె గంగాకిషన్, మున్సిపల్ కౌన్సిలర్ బారడి రమేశ్, చేపూర్ సర్పంచ్ టీసీ సాయన్న, సిద్ధుల గుట్ట చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు అంజాగౌడ్ పాల్గొన్నారు. కోటార్మూర్లో కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని పూసల సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. నిధులు మంజూరు చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కోటార్మూర్ పూసల సంఘం అధ్యక్షుడు మద్దినేని నరేశ్, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న, కోటార్మూర్ సంఘం ఉపాధ్యక్షుడు కోకిల కిషన్, ప్రధాన కార్యదర్శి సుంకరి గంగామోహన్, కోశాధికారి పొదిల గంగాధర్, పొదిల మైసయ్య తదితరులు ఉన్నారు.