యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

పాలకుర్తి రూరల్, డిసెంబర్ 31: యువత వ్యసనాలకు అలవాటు పడకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో ఎస్సై గండ్రాతి సతీశ్ నిరుపేద వృద్ధురాలికి నూతనంగా నిర్మించిన గృహన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఆనంతరం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బండిపెల్లి రాజమ్మకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ సైతం వృద్ధురాలకి ఆర్థిక సాయం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉషా దయాకర్రావు మాట్లాడుతూ యువత దయన్న స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఎవరికైనా సాయం చేస్తే అది జీవితాంతం గుర్తుంటుందన్నారు. ఎస్సై సతీశ్ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్యాల సరిత పరశురాములు, ఎంపీటీసీ బెల్లి సోమయ్య, ఉప సర్పంచ్ బొడిగె ప్రదీప్, గజ్జి సంతోశ్కుమార్, మాజీ సర్పంచ్లు గిలకత్తుల సుధాకర్, బండిపెల్లి మణెమ్మ, గుండెవేని కుమార్, గిలకత్తుల శంకరయ్య, గూడ యాదగిరి, చీటూరు చంద్రయ్య, పీసీలు ధనుంజయ, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్పీఎస్లో పాక్షిక విత్డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!