Jangaon
- Dec 25, 2020 , 03:05:48
VIDEOS
కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలి

- ఎంపీడీవో
స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 24 : గ్రామాల్లో ప్రతిరోజూ కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని ఎంపీడీవో కుమారస్వామి అన్నారు. మండలంలో ని రంగరాయగూడెంలో సర్పంచ్ మొ దుపల్లి అనూష అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. కుమారస్వామి మాట్లాడుతూ పేదలకు పనులు కల్పించాలనే ధ్యేయంతో ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిరుపేదలకు ప్రతిరోజూ కనీసం 50 మందికి పనులు చూపాలని ఆయన సూచించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేయిస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భిక్షపతి, ఎంపీవో మహబూబ్అలీ, పీఆర్ ఏఈ జుమ్మిలాల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రజిత, ఉపాధిహామీ ఏపీవో సతీశ్, వెలుగు ఏపీఎం కవిత, ఉప సర్పంచ్ అయిత రమేశ్, ఎంపీటీసీ శైలజ, వార్డు సభ్యులు నాగరాజు, రంగారెడ్డి, రాజమ్మ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అగ్రిహబ్కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ
- జగిత్యాల జిల్లాలో నెదర్లాండ్ మీడియా ప్రతినిధి
MOST READ
TRENDING