ముంబై : రూ. 3.8 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేసిన పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై పోలీసుకు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సర్వసతి నాయుడు అనే 50 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 1.02 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నాయుడు ఎంతోకాలంగా సౌత్ సెంట్రల్ ముంబై డ్రగ్స్ విక్రయాల్లో క్రీయాశీలకంగా ఉన్నట్లు పోలీసు అధికారి దత్తా నలవాడే తెలిపారు. ఆమెకు హెరాయిన్ ఎక్కడినుండి వచ్చింది, కస్టమర్స్ ఎవరూ అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నాయుడుపై కేసు నమోదు చేశారు.