అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,223 శాంపిల్స్ పరీక్షించగా 11,421 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 16,223 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1728577కు చేరింది. ప్రస్తుతం 138912 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11213కు పెరిగింది.