తొర్రూరు, జూన్ 2 : సమాజ సేవ అందరి బాధ్యత అని డిప్యూటీ డీఎంహెచ్వో గుండాల మురళీధర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం పారుపల్లి అప్పయ్య స్మారకార్థం ఫార్మాసిస్ట్ పారుపల్లి మహేశ్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు, ఆరోగ్య సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సమాజానికి సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దిలీప్, డాక్టర్ మీరాజ్, డాక్టర్ రేణుక, సీహెచ్వో విజయ్కుమార్ పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయం
కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం ట్రస్ట్ ఆధ్వ ర్యంలో డిప్యూడి డీఎంహెచ్వో డాక్టర్ గుండాల మురళీ ధర్, వైద్యాధికారి దిలీప్కుమార్, వైద్య ఆరోగ్య సిబ్బందిని సత్కరించారు. కొవిడ్ బాధితులకు భోజనం అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ నిరంజని, డాక్టర్ రేణుక, సీహెచ్వో విజయ్కుమార్, ట్రస్ట్ సభ్యులు ధరావత్ లోకేశ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
చిన్నగూడూరు : ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని డాక్టర్ రవికుమార్, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ మోహినుద్దిన్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లి, మేఘ్యతండాల్లో కరోనా ర్యాపిడ్ టెస్టులను పరిశీలించారు. కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారు హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సరస్వతి పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
చిన్నగూడూరు : మండలంలోని పగిడిపల్లి గ్రామంలో బుధవారం టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సురుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షుడు దుండి మురళి మాట్లాడారు. కరోనా బాధితులు అధైర్యపడొద్దన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుండి వీరయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గంధసిరి వెంకన్న, గ్రామపార్టీ అధ్యక్షుడు రవి, వార్డు సభ్యులు సింధు శ్రీపాల్, నాయకు లు మంగ్యానాయక్, మంగీలాల్, రమేశ్, శ్రీను, ఉప్పల య్య, వెంకటరెడ్డి, అంగన్వాడీ శ్రీమతి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి
పెద్దవంగర : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సర్పంచ్ చింతల భాస్కర్రావు అన్నారు. గంట్లకుంటలో ఉపాధి కూలీలకు మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు చారిటబుల్ ట్రస్టు సహకారంతో మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, గ్రామస్తులు సతీశ్, రమేశ్ పాల్గొ న్నారు.