హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఔషధాల బ్లాక్ మార్కెటింగ్పై 150 కేసులు నమోదు చేసినట్టు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వీటిలో మాస్క్లు ధరించనివారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి రూ.35.81 కోట్ల జరిమానా విధించినట్టు వివరించారు. నిర్ణీత దూరం పాటించనివారిపై 41,872 కేసులు, జనం గుమికూడినందుకు 13,867 కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2.61 లక్షల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నట్టు డీజీపీ తన నివేదికలో తెలిపారు.