హైదరాబాద్, జూన్ 1: లాక్డౌన్ కారణంగా నగదు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు ఊరట కల్పించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా మంగళవారం ప్రకటించింది. ఈ నగరాల్లో హైదరాబాద్తోపాటు విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరులు ఉన్నాయి. దీంట్లోభాగంగా తొలి విడుతలో హైదరాబాద్తోపాటు వైజాగ్, రాజమండ్రి వంటి నగరాల్లో అందిస్తున్నది. ఈ మొబైల్ ఏటీఎం రోజుకు 3-4 ప్రాంతాలను కవర్ చేయనున్నది. ఖాతాదారుడు ఈ మొబైల్ ఏటీఎంలలో 15 లావాదేవీలు జరుపుకునే వీలుంటుంది.