జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పలు అంశాలపై మండల సమావేశంలో చర్చ
కమాన్ఫూర్, మే 28: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ రాచకొండ లక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని, ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చూడాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు.
వైద్యాధికారి రావడం లేదు..
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నదని, క్వింటాల్కు అదనంగా 2 కిలోలకుపై తూకం వేస్తున్నారని, మళ్లీ రైస్ మిల్లుల్లో కూడా కటింగ్ చేస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. కమాన్ఫూర్ పీహెచ్సీ వైద్యాధికారి అశోక్కుమార్ దవాఖానకు సమయానికి రావడం లేదని, సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు చెప్పారు. కమాన్పూర్, జూలపల్లి, రొంపికుంట, గుండారంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో వెంకటేశ్ జాదవ్, తహసీల్దార్ ఉమా శంకర్, ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, వైస్ చైర్మన్ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు గొడిసెల ఉమ, కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, శెవ్వ శంకరయ్య, సర్పంచులు నీలం సరిత, ఇటవేన కొమురమ్మ, బొల్లపెల్లి శంకర్గౌడ్, తాటికొండ శంకర్, కొండ వెంకటేశ్, కట్కం రవీందర్, ఆకుల ఓదెలు, తొగరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం
కమాన్పూర్ మండలం సిద్దిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాక్సిన్ కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తాటికొండ శంకర్, డాక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెరువు రహదారి పరిశీలన
కమాన్పూర్లోని సెగ్రిగేషన్ షెడ్డు నుంచి పెద్ద చెరువు దాకా పొలాల గుండా గతంలో ఉన్న రహదారి పున:నిర్మాణ పనులను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీవో, ఎంపీవో ఆరిఫ్ హుస్సేన్, ఏపీవో రమేశ్బాబు ఉన్నారు.