ఇబ్రహీంపట్నం, (మే 25): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ పెండ్లి కొడుకును కరోనా పొట్టనపెట్టుకున్నది. గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు(26) బీటెక్ చేసి ఏపీలోని సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలానికి చెందిన ఓ యువతితో ఈ నెల 13న పెండ్లి జరిగింది. మరుసటి రోజే కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా.. కృష్ణంరాజుకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్త పెండ్లి కూతురు కూడా కొవిడ్ బారినపడ్డారు. లక్షణాలు ఎక్కువ కావడంతో కృష్ణంరాజును కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు.. అక్కడనుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. చికిత్సపొందుతూ కృష్ణంరాజు మంగళవారం మృతిచెందాడు. భార్య ఇంట్లో నే ఉండి కరోనా నుంచి కోలుకున్నది.