హైదరాబాద్: విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఎస్టీ విద్యార్థులకు అందించే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కోరింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలో పీజీ ఆపైన చదువులకు రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని ప్రభు త్వం అందిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.