రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 1.2 కోట్ల విలువైన 2.4 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.