సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ, మే 15: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలు మొదలై ఈనెల 26 నాటికి ఆరు నెలలు కానున్న నేపథ్యంలో ఆ రోజును ‘బ్లాక్ డే’గా పాటించాలని రైతు సంఘాల వేదిక సయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్కేఎం నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాలా మాట్లాడుతూ.. ఆ రోజున ప్రజలంతా వారి ఇళ్లు, వాహనాలు, దుకాణాల మీద నల్లజెండాలు ఎగురవేయాలని కోరారు. మే 26 నాటికి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఏడు సంవత్సరాలు కానున్న సందర్భంగా దీనిని నిరసిస్తూ రైతులంతా ఆ రోజున నిరసనదినంగా పాటించాలని బల్బీర్ సింగ్ పిలుపునిచ్చారు.