లలితా త్రిపురసుందరిగా అమ్మవారు

నెహ్రూపార్క్, అక్టోబర్ 20 : జనగామ పట్టణంలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం బాలాజీనగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజారులు మాదాసు రాజేశ్ భార్గవ-లలిత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఉప్పలమ్మ సహిత ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించారు. పూజారి వారణాసి పవన్శర్మ, కౌన్సిలర్ మహంకాళీ హరిశ్చంద్రగుప్తా, ఆరుట్ల శోభాఅనంతరెడ్డి, లింగయ్య, ఆంజనేయులు, మార్గం రవి, వీరమల్ల చంద్రశేఖర్, దామోదర్ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో దేవీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి మంగళవారం దుర్గామాత అమ్మవారు మంగళగౌరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శాంతినగర్, గౌడకాలనీ, గ్రామపంచాయతీ సమీపంలో అమ్మవారి విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, అర్చకుడు మణికంఠశర్మ, అధ్యక్షుడు బండి రాజు, బండి కిరణ్కుమార్, కమ్మగాని సుధాకర్, బండి యాకన్న, కమ్మగాని శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.
పెదమడూరులో ..
దేవరుప్పుల : మండలంలోని పెదమడూరులో దేవీశరన్నవరాత్సోవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన దుబ్బ రాజశేఖర్- లక్ష్మీప్రసన్న దంపతులు దుర్గామాతా విగ్రహం ప్రతిష్ఠించారు. మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారికి పూజలు చేశారు.
తాజావార్తలు
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్
- వాట్సాప్లో నెలకు ఎన్ని మేసెజ్లు వెళ్తాయో తెలుసా?