Jangaon
- Oct 15, 2020 , 03:01:45
VIDEOS
మత్తడిలో చేపల వేట..

దేవరుప్పుల/దంతాలపల్లి : భారీ వర్షాలతో కడవెండి తాళ్ల చెరువు అలుగు ఉప్పొంగుతున్నది. దీంతో మత్తడి వద్ద కట్టిన వల తెగి చేపలన్నీ కిందికి పోతున్నాయి. విషయం తెలిసిన కడవెండితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపల వేటకు బుధవారం వందలాదిగా తరలివచ్చారు. వలలు, తోపెలతో బస్తాల కొద్ది చేపలు పట్టి పండుగ చేసుకున్నారు. కొర్రమీను మొదలు అన్ని రకాల చేపలు దొరకడంతో ఉమ్మడిగా పట్టి పంచుకున్నారు. చేపల వేట ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. అలాగే దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, దంతాలపల్లి, పెద్దముప్పారం, దాట్ల, గున్నెలపల్లి, రేపోణి గ్రామాల్లోని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పెద్దముప్పారం వెళ్లే రోడ్డుపై నుంచి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, కుమ్మరికుంట్ల ఈనాకుంట చెరువు మత్తడిలో గ్రామస్తులు చేపలు పట్టారు.
తాజావార్తలు
- స్టాఫ్నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
MOST READ
TRENDING