మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే వాళ్ల రేంజ్ ఏంటి అనేది చూపిస్తాయి. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన అతడు కానీ.. ఖలేజా కానీ ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కొన్ని వందల సార్లు చూసినా కూడా బోర్ కొట్టాయి అనలేరు. అలాంటి క్లాసిక్స్ ఈ కాంబినేషన్లో వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి దాదాపు 11 ఏళ్ల తర్వాత మరో సినిమా చేయబోతున్నారు. దాంతో అంచనాలు ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవచ్చు.
త్రివిక్రమ్ తన సినిమాలకు టైటిల్స్ చాలా ఆసక్తికరంగా పెడుతుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమాకు కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈయన జూనియర్ ఎన్టీఆర్తో అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో మహేష్ బాబు సినిమా ముందుకు వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకు.. పార్ధు అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పార్ధు అనే టైటిల్ కు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కు మంచి అనుబంధం ఉంది. అతడు సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు పార్ధూనే. అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే పేరును తన సినిమా టైటిల్గా పెట్టాలని ఆలోచిస్తున్నారు. పార్ధు అనే టైటిల్ పెడితే కచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. పైగా అతడు సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని త్రివిక్రమ్, మహేష్ టైటిల్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్పై తాజా అప్డేట్..!