కరోనా సెకండ్ వేవ్ ప్రజల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. రోజుకు ఎంతో మంది మృత్యువాతపడడం అందరిలో భయాందోళనలు కలిగిస్తుంది. సరైన వైద్యం అందక కొందరు, ఆక్సిజన్ దొరక్క మరి కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. బయట అడుగుపెడుతున్నారంటే, మీ ప్రాణాలను రిస్క్లో పెడుతున్నట్టు అనే విషయాన్ని మరచిపోవద్దు అని గుర్తుంచుకోండని తన ట్వీట్లో తెలిపింది.
గత 48 గంటలలో నేను నా ఫ్యామిలీ నరకం అనుభవించాం. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇంట్లో ఉండండి. బయటకు వెళ్లాలని అనుకుంటే ప్రాణాన్ని రిస్క్లో పెడుతున్నారనే విషయాన్ని గ్రహించి బ్యాక్ స్టెప్ వేయండి. జీవితాలని ఏ మాత్రం అశ్రద్ధ చేయోద్దు అని కృతి కర్భంద తన ట్వీట్లో పేర్కొంది. ఆమె ట్వీట్ని చూస్తుంటే కృతితో పాటు ఆమె ఫ్యామిలీ కరోనా బారిన పడినట్టు అర్దమవుతుంది. కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది.