పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ దేశానికే వ్యవసాయ రంగాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం మాల్కాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్నం పెట్టే రైతు ఏడిస్తే రాష్ట్రం బాగుండదని భావించి సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగనీటికి శాశ్వత పరిష్కరం చూపారన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా ఆపత్కాలంలో రైతులు పండించిన పంటను కోనుగోలు చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతులుకు కోనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చర్యలు తీసుకోంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, ఎన్వీ రమణారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్
అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం