ప్రతి నెలా 15లోపు సదరం క్యాంపులు నిర్వహించాలి

- అధికారులతో సమీక్షలో కలెక్టర్ నిఖిల
జనగామ క్రైం, సెప్టెంబర్ 19 : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోపు సదరం క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంబంధిత వైద్యాధికారులు సదరం క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి జిల్లాలోని దివ్యాంగులు తొలుత మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్లో నిర్ణయించిన తేదీల ప్రకారం సదరం క్యాంపునకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఆ రోజు వైద్యాధికారులు విధుల్లో ఉండేలా చూడాలని సదరం కమిటీ సభ్యులకు నిఖిల సూచించారు.
క్యాంపును నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి, డీడబ్ల్యూవో జ్యోతి, డీఈవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రవీందర్యాదవ్, జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, ఎన్జీవో బజాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ ముడి సరుకుల ఎగుమతిపై నిషేధం లక్ష్యానికి ఆటంకం!
- హర్యానా నిర్ణయం.. ఎకనమిక్ సూసైడ్!
- ఏప్రిల్ 15నుంచి అమెజాన్ ఇండియా ‘ఎస్ఎంభవ్ ’ సదస్సు
- 2013లో ఫైన్.. ఇప్పుడు సమస్యా? బాలీవుడ్ ఐటీ దాడులపై నిర్మలమ్మ ఎటాక్
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్