ఆదిలాబాద్ : జిల్లాలోని బోథ్లో గల పోచమ్మగల్లీ ఒకటో వార్డులో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ. 13.88 లక్షల ఆస్తి నష్టం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి గంగయ్య కుటుంబమంతా నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్కు వెళ్లారు. శుక్రవారం ఇంట్లో నుంచి మంటలు చేలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మొత్తం వ్యాపించాయి. స్థానికులు గమనించి ఫైరింజన్కు సమాచారం అందించి, మంటలార్పే ప్రయత్నం చేశారు.
ఫైరింజన్ చేరుకునే సరికి ఇంట్లో సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదం విషయం తెలుసుకున్న గంగయ్య కుటుంబీకులు ఇంటికి చేరుకొని విలపించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ్ ప్రమాద స్థలానికి వెళ్లి రూ 13.88 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు