వివాహ వేడుకల్లో ఘర్షణ : 14 మందిపై కేసు

జనగామ క్రైం, ఆగస్టు 8 : వివాహ వేడుకల్లో ఘర్షణపడి ఇరువర్గాలు పరస్పరదాడులు చేసుకున్న ఘటనలో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..లింగాల ఘనపురం మండలం చిక్కులోనిగూడెంకు చెందిన వరుడికి, జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామానికి చెందిన వధువుతో వివాహం నిశ్చయించగా, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామ శివారులో శనివారం పెళ్లి జరిగింది. భోజనంలో మటన్ లేదంటూ వరుడి తరపు బంధువులు వధువు తరపు వారితో గొడవకు దిగినట్లు సమాచారం. దీనిని మనసులో పెట్టుకున్న అమ్మాయి తరుపు బంధువులు వివాహం ముగిశాక చంపక్హిల్స్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపి గొడవకు దిగారు. బీరు సీసాలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకొని తీవ్రంగా గాయపర్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఎస్సై రాజేష్ నాయక్ ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ డీ మల్లేశ్ యాదవ్ విలేకరులకు తెలిపారు.
తాజావార్తలు
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’