కరోనా మహమ్మారి టాలీవుడ్ ఇండస్ట్రీపై తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి చాలా మందికి కరోనా సోకగా, ఇప్పుడు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ, మాస్ట్రో సినిమాటోగ్రాఫర్ యువరాజ్ సైతం కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్లో ఉన్నారని, కొద్ది రోజులుగా వారితో కాంటాక్ట్లో ఉన్నవారు సైతం క్వారంటైన్కు వెళ్లినట్టు సమాఆరం.
అఖిల్ ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఏకే సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ, రచన సహకారం వక్కంతం వంశీ అందిస్తున్నారు. తాజాగా వక్కంతంకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో కాంటాక్ట్లో ఉన్న సురేందర్ రెడ్డి ఐసోలేషన్కు వెళ్లారని సమాచారం. ఇక నితిన్ అంథాదూన్ రీమేక ప్రాజెక్టు మాస్ట్రో సినిమాటోగ్రాఫర్ యువరాజ్ కు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది.