వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు
కంటిమీద కునుకు లేకుండావైద్యులు, అధికారులు
వేగంగా టెస్టులు.. మెరుగైన వైద్యసేవలు
ఉమ్మడి జిల్లాలో 14.57 లక్షల మందికి పరీక్షలు
ఇప్పటి వరకు 55వేల మందికి పాజిటివ్
వీరిలో 44వేల మంది పూర్తిగా రికవరీ
యాక్టివ్ కేసులు 5వేలు
హోం ఐసొలేషన్లో 4వేల మంది
ఇప్పటికి 2.83 లక్షల మందికి వ్యాక్సిన్
వరంగల్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచాన్ని తారుమారు చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో కట్టడి చేస్తున్నది. కరోనా కట్టడికి ఉత్తమమార్గంగా ఉన్న టెస్టిం గ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ, బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తు న్నది. హోంఐసొలేషన్లో ఉన్న వారికి మందులు పంపి ణీ చేయడంతోపాటు ఒత్తిడి లేకుండా మనోధైర్యం కల్పిస్తున్నది. ఆరోగ్యశాఖ, ఇతర శాఖల సిబ్బంది వేగంగా స్పందిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ కట్టడవుతున్నది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రా మాల్లో ఎక్కడిక్కడ టెస్టులు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 55,430 మం దికి కరోనా పాజిటివ్గా వచ్చింది. వీరిలో 44,284 మంది చికిత్సపొంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఉమ్మ డి జిల్లాలో 5086 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4690 మంది హోం ఐసొలేషన్లో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం 17మందిని హైదరాబాద్కు పంపించారు.
కరోనా బాధితుల కోసం ఉమ్మడి జిల్లాలో 5437 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్ప టివ రకు 14.57 లక్షల మందికి టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే ఉచితంగా మందులను ఇస్తున్నారు. వైద్య సదుపాయం అవసరమైన వారికి సమీపంలోని దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో కరోనా మహమ్మారి బారిన పడిన వారు త్వరగా కోలుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. మంత్రుల ఆదేశాల మేర కు కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారులు కరోనా కట్టడికి అవసరమైన చర్య లు తీసుకుంటున్నారు. ఆశ వర్కర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, గ్రేటర్ వరంగల్లో 58 బృందాలు అన్ని డివిజన్లలో కరోనాపై సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి టెస్టులు చేస్తున్నారు. గ్రేటర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు 2.50లక్షల కు టుంబాలకు మాస్కులను పంపిణీ చేశారు. స్వయం స హాయక సంఘాల నుంచి శానిటైజర్లు, ఫినాయిల్ సెం ట్రల్ జైలు నుంచి 5వేల మాస్కులు కొనుగోలు చేసింది.
వేగంగా వ్యాక్సిన్
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 92వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆరు జిల్లాలకు కలిపి 31,410 వ్యాక్సిన్ వాయిల్స్ వచ్చాయి. ఇప్పటివరకు 2,83,854 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. వ్యా క్సిన్ తీసుకున్న వారి పర్యవేక్షణ కోసం 49దవాఖానలు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 38,818 మంది ఆరోగ్య కార్యకర్తలు, 28,190మంది ఫ్రంట్లైన్ వారియర్స్ వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 60ఏండ్లు దాటిన వారు 1.10 లక్షల మంది ఉన్నారు. 45నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వారు 1.06 లక్షల మంది ఉన్నారు. అన్ని వయస్సుల వారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.