గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో హిట్ ఫెయిర్ గా నిలిచారు టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ రెండు చిత్రాలు రష్మికకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి. మళ్లీ రెండేళ్త తర్వాత ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. విజయ్-రష్మిక మరోసారి స్క్రీన్పై మెరువబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఎలాంటి ప్రాజెక్టుతో వస్తున్నారని ఆలోచించకండి. ఎందుకంటే విజయ్-రష్మిక ఈ సారి వస్తోంది యాడ్లో.
సంతూర్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్లు గా నియమితులయ్యారు ఈ ఇద్దరు యాక్టర్లు. త్వరలోనే ఈ యాడ్ టీవీ, ఇతర ప్లాట్ఫామ్స్ లో సందడి చేయనుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో పాన్ ఇండియా నేపథ్యంలో వస్తున్న లైగర్ లో నటిస్తున్నాడు. మరోవైపు రష్మిక హిందీలో రెండు ప్రాజెక్టులతోపాటు తెలుగులో పుష్ప చిత్రంలో, క్రిష్-వైష్ణవ్ తేజ్ డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ