ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

- జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య
దేవరుప్పుల, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అభిస్తుందని జిల్లా విద్యాధికారి సిగసరపు యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి, హరితహారం అమలు తీరును పర్యవేక్షించారు. మండల విద్యావనరుల కేంద్రానికి వచ్చిన యాదయ్య రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు,
ఆయా పాఠశాలల్లో నాటిన మొక్కల వివరాలను సేకరించారు. దేవరుప్పులలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నాటిన మొక్కలను రికార్డులతో సరి చూశారు. కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో నాటిన మొక్కలను చూశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో పాటు దేవరుప్పుల, కామారెడ్డిగూడెం పాఠశాలల్లో మరిన్ని మొక్కలు నాటే అవకాశం ఉందని, యాజమాన్యం చొరవ చూపి నాటించాలన్నారు. ఈ విషయంలో ఎంపీడీవో అనితతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ గోలి రవీందర్రెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్