ముంబై: యువ క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, దేవ్దత్ పడిక్కల్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఈ క్రికెటర్లతో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువరాజ్సింగ్లాంటి స్టార్ క్రికెటర్లతోపాటు మహిళా క్రికెటర్ సుష్మా వర్మతోనూ ప్యూమా ఒప్పందం కుదుర్చుకుంది.
గతేడాది ఆస్ట్రేలియా టూర్లో రాణించిన వాషింగ్టన్ సుందర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున నిలకడగా రాణిస్తున్న దేవ్దత్ పడిక్కల్ ఈ టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ దృష్టిని ఆకర్షించారు. ప్యూమా ఫరెవర్ ఫాస్టర్ స్పిరిట్ అనే నినదానికి ఈ ఇద్దరూ సరిగ్గా సరిపోతారని ఈ సందర్భంగా ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ అన్నారు.
ఇప్పటికే స్టార్లుగా ఉన్న ప్లేయర్స్నే కాకుండా యువ ప్లేయర్స్ను కూడా ప్రోత్సహించాలని తాము ఎప్పుడూ భావిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్లేయర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్లో ఆడుతున్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
డీజిలైతే కిలోమీటర్కు రూ.18, ఎలక్ట్రికలైతే రూ.6
ఆరుపదుల వయస్సులోను జిమ్లో చెమటోడుస్తున్న స్టార్ హీరో