ఎంజీఎంకు నిధుల కేటాయింపుపై హర్షం

స్టేషన్ఘన్పూర్టౌన్, జూలై 26: రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ వరంగల్లోని ఎంజీఎం దవాఖాన అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ. 14.50 లక్షలు మంజూరు చేయడం హర్షణీయమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ మహాసభ మండల కార్యవర్గ సమావేశం ముదిరాజ్ మహాసభ యూత్ జిల్లా అధ్యక్షుడు గోరంతల యాదగిరి అధ్యక్షతన జరిగింది. నీల గట్టయ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం దవాఖానలోని కొవిడ్-19 వార్డుల్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఎంపీ బండా ప్రకాశ్ నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ నీల రాజు, ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు బూర్ల శంకర్, ముప్పిడి మల్లేశం, ఈ. రమేశ్, సంపత్, కుమార్, నియోజక వర్గ ఇన్చార్జిలు చిలువేరు లింగం, చిక్కుడు రమేశ్, చిక్కుడు రాములు, ముదిరాజ్ మహాసభ శివునిపల్లి యూత్ అధ్యక్షుడు కొండ వేణు, సాంబరాజు, సురేశ్, అనిల్, అజయ్, శ్రీకాంత్, రమేశ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్