బడంగ్పేట,ఏప్రిల్18: క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దివంగత మైసయ్య జ్ఞాపకార్థంగా కేఎల్ఆర్ గ్రౌండ్లో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలైన బుల్స్, తండర్ జట్టులకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం అల్మాస్గూడలో జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం మైసయ్య నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారిని చైతన్యం చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. అతడి జ్ఞాపకార్థంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు తగిన సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైయింద్, బండారి మనోహర్, సూర్ణగంటి అర్జున్, ఏనుగు రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామిడి రాం రెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, ముత్యాల కృష్ణ, కామేశ్రెడ్డి, మైసయ్య సతీమని మాధవి, మహేందర్ పాల్గొన్నారు.