భక్తుల రద్దీ సాధారణం
ఖజానాకు రూ. 7,15,581ఆదాయం
యాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి స్వామివారి నిత్యారాధనలు మొదలయ్యాయి. నిజా భిషేకంతో స్వామివారి ఆరాధనలు ప్రారంభించారు. బాలా లయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం,అర్చనలు, సుదర్శ న హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో జరిగాయి. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు కొవిడ్ నిబంధ నలు పాటిస్తూ పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గ జవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు.సాయం త్రం అలంకార జోడు సేవలు, మండపంలో అష్టోత్తర పూ జలు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర బాలా లయంలో సీతారామచంద్ర వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల రద్దీ సాధారణం..
వారాంతాల్లో ఇష్టదైవమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శిం చుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ఆర్జిత సేవల్లో పాల్గొని మొ క్కులు చెల్లించుకుంటారు. కానీ కరో నా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ర ద్దీ సాధారణంగా కొనసాగింది. స్వామి వారి నిత్యకల్యాణం, వ్రతాల్లో భక్తుల పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. కా గా, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. క్యూ లైన్లు, బాలాలయంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఆర్జిత సేవలు, క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు మాస్క్ ధరించేలా ప్రత్యేక నిఘా పెట్టారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు శానిటైజర్ వేసి చేతులు శుభ్రం చేయిస్తున్నారు.
ఖజానాకు రూ. 7,15,581 ఆదాయం
స్వామి వారి ఖజానాకు రూ. 7,15,581 ఆదాయం స మకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకిం గ్ ద్వారా రూ. 43,898, రూ. 100 దర్శనాలతో రూ. 2, 300, వీఐపీ దర్శనాలతో రూ. 19,050, కైంకర్యాల ద్వా రా రూ. 4,002, సుప్రభాతంతో రూ. 700, ప్రచారశాఖ ద్వారా రూ. 995, క్యారీ బ్యాగులతో రూ. 2,750, వ్రతాల తో రూ. 27,000, కల్యాణకట్టతో రూ. 25,400, ప్రసాద విక్రయాలతో రూ. 3,45,445, వాహన పూజలతో రూ. 9,200, టోల్గేట్ ద్వారా రూ.1,180, అన్నదాన విరా ళంతో రూ. 1,366, సువర్ణపుష్పార్చనతో రూ. 28,380, యాదరుషి నిలయంతో రూ. 54,500, పాతగుట్టతో రూ. 13,845, టెంకాయల విక్రయాలతో రూ. 29,730తో కలి పి రూ. 7,15,581 ఆదాయం లభించిందన్నారు.
ఇవి కూడా చదవండి
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!