Jangaon
- Jul 16, 2020 , 01:43:01
VIDEOS
ద్విచక్ర వాహనదారుడిపై కేసు

జనగామ క్రైం, జూలై 15: కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు ఇసుక తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ శనిగరపు తిరుపతిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని బైక్ ఢీకొట్టిందని అర్బన్ సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. ఆయన కథనం.. లారీ డ్రైవర్ పెంబర్తి శివారు వద్ద టీ తాగేందుకు లారీని ఆపాడు. టీతాగి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో నంబర్ ప్లేట్లేని ఓ ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి లారీ డ్రైవర్ తిరుపతిని ఢీ కొట్టి వెళ్లాడు. తిరుపతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జనగామ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. బాధితుడు శనిగరపు తిరుపతి కుమారుడు నరేశ్ బుధవారం జనగామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్ రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
- చారిత్రాత్మకం ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం.. చరిత్రలో ఈరోజు
- మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !
MOST READ
TRENDING