గీసుగొండ, ఏప్రిల్ 5 : ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో సోమవారం ఎనిమిది మంది ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది. గ్రామంలోని వాటర్ప్లాంట్, జీపీ భవనం, శిక్షణ కేంద్రం, నర్సరీని సందర్శించి పరిశీలించింది. అనంతరం జీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, సర్పంచ్ మల్లారెడ్డి గ్రామాభివృద్ధిని వారికి వివరించారు. గ్రామస్తుల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామస్తులు వాడుకునేలా చేశామని వివరించారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించామని చెప్పారు. గ్రామంలో 26 అభివృద్ధి కమిటీలు పనిచేస్తున్నాయని, కమిటీల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు సభ్యుడిగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ గ్రామజ్యోతిని కార్యక్రమాన్ని గంగదేవిపల్లిలోనే ప్రారంభించి, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు రూ.10కోట్ల నిధులు కేటాయించిట్లు తెలిపారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ల మాట్లాడుతూ.. వందశాతం మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు వాటిని వాడకంలోకి తేవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్లు దిపక్తివారీ, దిపక్రెడ్డి, ప్రతిమసింగ్, రిజ్వాన్ బాషాషేక్, అంకిత్, హేమంత్ పాటిల్, గరీనా అగర్వాల్, చిత్ర మిశ్రా, ఎంపీడీవో గడ్డం రమేశ్, ఏపీఎం సురేశ్కుమార్, ఏపీవో మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
ఓరుగల్లు కోట సందర్శన
ఖిలావరంగల్/హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 : చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటను సోమవారం ఎనిమిదిమంది ట్రైనీ కలెక్టర్లు సందర్శించారు. కీర్తితోరణాలు, ఖుష్మహల్, ఏకశిలగుట్ట తదితర కట్టడాలను వీక్షించారు. వారి వెంట మర్రిచెన్నారెడ్డి ట్రైనింగ్ సెంటర్ లైజనింగ్ ఆఫీసర్ రాంబాబు, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జి అజయ్ ఉన్నారు. అనంతరం వారు వేయిస్తంభాల రుద్రేశ్వరాలయాన్ని సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ట్రైనీ కలెక్టర్లతోపాటు రాష్ట్ర సీఆర్పీఎఫ్ డీజీ రశ్మీశుక్లాతో పూజలు చేయించారు.
ఇవి కూడా చదవండి..
నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం: అమిత్ షా
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్