వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. శుక్రవారం సాయంత్రం వరకు దేశంలో పది కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో రెండు డోసులు తీసుకున్నవారు 5.8 కోట్ల మంది ఉన్నారని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.
ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది. ఏప్రిల్ 19 నాటికి దేశంలోని 90 శాతం వయోజనులకు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. నిన్న రాత్రి 8 గంటల వరకు 12 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 7,06,18,026కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..