అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ షాకిచ్చారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ తన ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.
కేవలం తాను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి