నైపితా: మయన్మార్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు 43 మంది చిన్నారులు మృతిచెందినట్లు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి ఒకటిన అక్కడ సైన్యం ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనిక చర్యను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆ నిరసనల్లో ఇప్పటి వరకు 536 మంది మరణించారు. దాంట్లో 43 మంది చిన్నారులు ఉన్నట్లు హక్కుల సంస్థ సేవ్ ద చిల్డ్రన్ పేర్కొన్నది.