సీట్ల సంఖ్య తగ్గింపు
హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. వాటిలో సగానికి అంటే 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం స్థానాలను 90కి పెంచినా ఎన్నికల జరిగే స్థానాల సంఖ్యను 20కి కుదించింది. చైనా తాజా నిర్ణయం విచారకరమని హాంకాంగ్కు చెందిన డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు ఎమిలీ లౌ అన్నారు. హాంకాంగ్కు ఇదో దుర్దినంగా ఆమె అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి