న్యూఢిల్లీ: ఖైతాన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదుచేసింది. బ్యాంకులకు సుమారు 244 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తిలో ఖైతాన్ కంపెనీకి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. తప్పుడు ఆధారాలతో బ్యాంకులను ఆ కంపెనీ మోసం చేసినట్లు కేసు దాఖలు చేశారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ జీవీ శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు బుక్ చేసింది. రుణాల కోసం ఖైతాన్ డైరక్టర్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.