మిరప తెంపేందుకు వెళ్తూ నలుగురు మహిళా కూలీల దుర్మరణం
12 మందికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు, మార్చి 19 : జాతీయ రహదారి 163 రక్తసిక్తమైంది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆటో, క్రూజర్ ఢీకొని ముగ్గు రు మహిళా వృద్ధ కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో వృద్ధురాలు దవాఖానలో తుదిశ్వాస విడిచింది. 12 మం ది తీవ్రంగా గాయపడగా వీరిలో ముగ్గు రి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆత్మకూరు నుంచి 15మంది రోజు వారీ కూలీలు నల్లబెల్లి మండలం రంగాపురంలో మిరప కాయలు కోసేందుకు ఉదయం 7.40గంటలకు ఆటోలో బయలుదేరారు. నీరుకుళ్ల క్రాస్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న క్రూజర్ వాహనం బ లంగా ఢీ కొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న మాడిశెట్టి సాంబలక్ష్మి (70), మహబూబీ (62), పాలకుర్తి సరోజన(70), అక్కడికక్కడే చనిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆత్మకూరు భారతమ్మ (67) మృతిచెందింది. ఆటో డ్రైవర్ అల్వాల రవి(38), ఆత్మకూరు సరస్వతి (55), తాళ్ల అనూష (25), పోతు లత (30), కస్తూరి మౌనిక (35), పార్శ సునీత (45), తాళ్ల రాణి (32), కక్కెర్ల శంకరమ్మ (60), ఆత్మకూరు విజయ మ్మ (48), చింతపట్ల రజిత (40), ని మ్మకాయల శోభ (50), ఏరుకొండ ర మ (50) తీవ్రంగా గాయపడ్డారు. విష యం తెలిసి ఆత్మకూరు గ్రామస్తులు, సర్పంచ్ పర్వతగిరి రాజు, చుట్టుపక్కల గ్రామాలవారు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి తరలివచ్చారు. ఆటోలో చిక్కుకున్నవారిని, చనిపోయినవారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రంజిత్కుమార్, ఎస్ఐ రాజబాబు వచ్చి క్షతగాత్రులను 108లో ఎంజీఎం దవాఖానకు చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరుకొండ రమను మెరుగైన వై ద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు.
అతివేగం వల్లే..
ఆటోను ఢీకొన్న క్రూజర్ వాహనం డ్రైవర్ భూక్యా సురేశ్ జనగామ జిల్లా స్టేషన్ఘనపురం మండలంలోని విశ్వనాథపురానికి చెందినవాడని, అతడు నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడని పరకాల ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సురేశ్పై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంత్రుల విచారం
రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు చనిపోయిన విషయం తెలిసి మం త్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతు ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.