వరంగల్ రూరల్ : కల్లు అనుకుని పొరపాటున పురుగుల మందు తాగి ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ విషాద ఘటన జిల్లాలోని శాయంపేట మండలం మైలారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సొంటిరెడ్డి సుశీల(70)కు రోజూ కల్లు తాగే అలవాటుంది. దీంతో ఆమె కుమారులు శంకర్, జనార్దన్ ఎవరో ఒకరు కల్లు తెచ్చి ఇస్తుండేవారు. అయితే ఈ నెల 16న జనార్దన్ కొప్పుల శివారులోని వరి పొలానికి పురుగుల మందు కొట్టేందుకు వెళ్లాడు.
మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి మిగిలిన పురుగుల మందును ఓ బాటిల్లో పోసి పక్కకు పెట్టాడు. అన్నం తినేందుకు జనార్దన్ ఇంట్లోకి వెళ్లాడు. బాటిల్ను చూసిన సుశీల కల్లు అనుకుని తాగింది. అదే సమయంలో జనార్దన్, కుటుంబసభ్యులు వచ్చి బాటిల్లో ఉన్నది పొలానికి కొట్టిన మందు అని చెప్పడంతో కల్లు అనుకుని తాగినట్లు సుశీల వారికి చెప్పింది. వెంటనే వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.