మంచిర్యాల : మంచిర్యాల జిల్లా రంగంపల్లి శివారులో గూడెం ఎత్తిపోతల పథకం పైపులైన్ పగిలింది. దీంతో దాదాపు 200 ఎకరాల్లో పంట నీటమునిగింది. పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఏటా పైపులైన్ పగులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పైపులైన్ మరమ్మతు చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు రంగంలోకి దిగారు.