లక్నో: కుమార్తెను నరికిన తండ్రి ఆమె తలతో గ్రామంలో నడిచాడు. భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. పాండేటర గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ అనే వ్యక్తి బుధవారం తన 17 ఏండ్ల కుమార్తెను నరికి చంపాడు. అనంతరం ఆమె తలతో గ్రామంలో నడవసాగాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సర్వేష్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
పోలీసులు అతడ్ని ప్రశ్నించగా తన కుమార్తె ఒకరితో సంబంధం కలిగి ఉన్నదని, అందుకే హత్య చేసినట్లు చెప్పాడు. ఆమె మృతదేహాం ఇంట్లో ఉన్నదని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హర్దోయి పోలీస్ స్టేషన్ అధికారి కపిల్ డియో సింగ్ చెప్పారు. మృతురాలి తలను పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చి అనుచితంగా ప్రవర్తించిన ఒక పోలీస్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.