చెన్నై: ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ట్రైనింగ్ క్యాంప్ మార్చి 11 నుంచి చెపాక్ స్టేడియంలో ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ క్యాంపు మొదటి రోజు నుంచే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ బుధవారం చెన్నై చేరుకున్నాడు.
చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా తీసిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఆ జట్టు కీలక బ్యాట్స్మన్ అంబటి రాయుడు ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు. బయో సెక్యూర్ వాతావరణంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ క్యాంప్ నిర్వహించనున్నారు. మిగతా ఫ్రాంఛైజీలకన్నా ముందే చెన్నై ట్రైనింగ్ క్యాంప్ను నిర్వహించబోతున్నది.