తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నగరంలోని ఆటోవాలాలతో కలిసి పెట్రో ధరల పెంపుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన వ్యక్తం చేశారు. థరూర్ తాడుతో ఆటోను లాగిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.