జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
ములుగుటౌన్, జూలై 19 : కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు రూ. 15,01,740 విలువల గల కల్యా ణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సీతక్క, ఎంపీపీ శ్రీదేవితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆడబిడ్డల పెండ్లి ఖర్చులకు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్య మ సమయంలో ములుగు మండలంలోని భాగ్య తండాలో కల్లారా చూసిన కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, విజయరాం, సుధీర్, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.